News March 30, 2025

వనపర్తి: పెబ్బేర్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలో కింది విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా అమరచింత, పెబ్బేరులో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దగడ 41.2, శ్రీరంగాపూర్ 41.2, ఆత్మకూరు 41.2, వెలుగొండ 41.2, కేతపల్లి 40.9, రేమోద్దుల 40.9, రేవల్లి 40.8, పెద్దమందడి 40.7, జానంపేట 40.7, వీపనగండ్ల 40.7, వనపర్తి 40.5, గోపాల్‌పేట 40.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ప్రమాదంలో మన డ్యాములు

image

మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినా, డ్యాముల భద్రతపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం చేయాల్సిన కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యుయేషన్ రికార్డులు ఉమ్మడి జిల్లాలోని ఏ డ్యామ్‌కు లేవు. డ్యాముల కరకట్టలు, గేట్ల పటిష్టతపై ఎప్పటికప్పుడు స్టడీ చేయట్లేదు. ప్రమాదం సంభవిస్తే చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా అధికారుల వద్ద లేకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది.

News November 12, 2025

ఆదిలాబాద్ రిమ్స్ సీఎంఓ గుండెపోటుతో కన్నుమూత

image

ఆదిలాబాద్ రిమ్స్‌లోని క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) నగేష్ గౌడ్ (30) గుండెపోటుతో మృతి చెందారు. టీచర్స్ కాలనీలో నివాసముంటున్న నగేష్ గౌడ్‌కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోర్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.

News November 12, 2025

బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

image

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్‌<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.