News April 5, 2025
వనపర్తి పోలీసులు భేష్: డీజీపీ

రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తున్నామని డీజీపీ జితేందర్ అన్నారు. శుక్రవారం వనపర్తిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల గురించి అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.
Similar News
News November 28, 2025
NTR: న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

విజయవాడకు చెందిన న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గిరిజన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుండగా ఆయన సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన మహిళ మాచవరం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్సై శంకరరావు కేసు నమోదు చేశారు.
News November 28, 2025
HYD: తెలుగు వర్సిటీ..”SPTU-B” ఘన విజయం

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో సౌత్ జోన్ ఎంపికలలో భాగంగా నిర్వహించిన T20 మ్యాచ్లో ‘SPTU-A’ జట్టుపై ‘SPTU-B’ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SPTU-B జట్టు 20 ఓవర్లలో 195/7 పరుగులు చేయగా.. వాసు 52 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. SPTU-A 17.2 ఓవర్లకే 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపొందిన జట్టుకు వీసీ, రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు.
News November 28, 2025
గజ్వేల్: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా తూంకుంట

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన నేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి. వర్గల్ మండల కేంద్రం సర్పంచ్గా మొదటగా నర్సారెడ్డి పనిచేశారు. అనంతరం వర్గల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మెదక్ డీసీసీబీ ఛైర్మన్గా పని చేసిన ఆయన 2009లో అసెంబ్లీ పునర్వ్యవస్థీకరణలో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ గా మారడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు.


