News March 22, 2025
వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News December 23, 2025
గూగుల్ టెకీలకు గుడ్న్యూస్.. గ్రీన్కార్డ్ ప్రాసెస్ మళ్లీ షురూ!

H-1B వీసాతో గూగుల్లో పనిచేసే వారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియను 2026 నుంచి మళ్లీ భారీ స్థాయిలో మొదలుపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఆఫీసు నుంచి పనిచేస్తూ, మంచి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్న సీనియర్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశం కోసం రిమోట్ వర్కర్లు ఆఫీసు లొకేషన్కు మారాలి. లేఆఫ్స్ వల్ల రెండేళ్లుగా ఆగిన ఈ ప్రాసెస్ మళ్లీ స్టార్ట్ కానుండటంతో వేలాదిమంది ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
News December 23, 2025
రైతన్నకు మంచిరోజులు వచ్చేది ఎప్పుడో!

ధనిక, పేద తేడా లేకుండా అందరి ఆకలి తీర్చేది రైతు పండించే మెతుకులే. దాని కోసం రైతు పడే కష్టం, మట్టితో చేసే యుద్ధం వెలకట్టలేనిది. తెల్లవారుజామునే నాగలి పట్టి పొలానికి వెళ్లే అన్నదాతే అసలైన హీరో. తన రక్తాన్ని చెమటగా మార్చి పంటకు ప్రాణం పోసే రైతు అప్పుల్లో ఉంటే అది దేశానికే తీరని లోటు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి రైతు రాజయ్యేదెప్పుడో! *ఇవాళ జాతీయ <<18647657>>రైతు<<>> దినోత్సవం
News December 23, 2025
రైతుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత: మంత్రి గొట్టిపాటి

దేశానికి అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు మరియు రుణాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మొంథా తుఫాన్ సమయంలో బాపట్ల జిల్లాలోని రైతులకు అండగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.


