News January 28, 2025
వనపర్తి: ప్రయోగ పరీక్షలకు 41 కేంద్రాల ఏర్పాటు

వనపర్తి జిల్లాలో వచ్చేనెల 3 నుంచి జరిగే ఇంటర్ వార్షిక ప్రయోగ పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ విభాగం, వృత్తి విద్యా విభాగంలో మొత్తం 6,591 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
VKB: మద్యం షాపుల టెండర్లకు 247 దరఖాస్తులు

జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు 247 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లాలోని 59 మద్యం షాపులకు టెండర్లకు దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటివరకు 247 దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 18 వరకు చివరగా మూడు రోజులు మిగిలి ఉండడంతో భారీగా దరఖాస్తులు వస్తాయని తెలిపారు.
News October 15, 2025
జనగామ: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషాతో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు దిశానిర్ధేశం చేశారు.
News October 15, 2025
కామారెడ్డి: ‘చట్టాలపై అవగాహన కల్పించాలి’

సమాచార హక్కు చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర కమిషనర్ భూపాల్ సూచించారు. బుధవారం రాత్రి కామారెడ్డి జిల్లా ఆర్టీఐ ప్రతినిధి మోతే లావణ్య హైదరాబాద్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిపై పూర్తి వివరాలు సేకరించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు.