News April 11, 2025

వనపర్తి: ‘ఫులే ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

image

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫులే అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫులే జయంతి వేడుకలను హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఫులే చిత్రపటానికి రావుల పూలమాల వేసి నివాళులర్పించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్, తుంగ బాలు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి 31 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

News December 1, 2025

ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

image

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.