News April 11, 2025
వనపర్తి: ‘ఫులే ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫులే అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫులే జయంతి వేడుకలను హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఫులే చిత్రపటానికి రావుల పూలమాల వేసి నివాళులర్పించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్, తుంగ బాలు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.
News December 5, 2025
కర్నూలు: ‘QR కోడ్ స్కాన్ చేయండి.. అభిప్రాయం తెలపండి’

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని సివిక్స్ సొసైటీ కన్వీనర్ రఘురాం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సివిక్స్ సొసైటీ తరఫున క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆన్లైన్ సంతకం చేయాలన్నారు. దీన్ని 5 నియోజకవర్గాల ప్రజల తమ బాధ్యతగా భావించాలని కోరారు.
News December 5, 2025
ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం

ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్లపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ వారికి సూచించారు.


