News January 30, 2025
వనపర్తి: భారీ కొండచిలువ పట్టివేత

వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలో ఎర్రగట్టు తండాకు కూతవేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంటపడింది. భయపడిన రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే స్నేక్స్ సొసైటీ టీంకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంటలకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసిన వలకు చిక్కిన సుమారు 18కిలోల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అడవిలో వదిలేశారు.
Similar News
News November 24, 2025
బెల్లంపల్లి: ‘రైతు బిడ్డలు.. మీకెందుకు ఇవన్నీ’

ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తోందని.. తల్లిదండ్రులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు రాసిన లేఖ జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలు విన్నవిస్తే ‘మీరు రైతు బిడ్డలు మీకెందుకు ఇవన్నీ’ అని అంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్
News November 24, 2025
కొత్తగూడెం: ‘పోలీస్ వాహనాలు కండిషన్లో ఉంచాలి’

పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్లో ఉంచుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెడ్ క్వార్టర్స్లో పోలీసు వాహనాలను సోమవారం ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని వాహనాలను కండిషన్లో ఉంచాలని సూచించారు.
News November 24, 2025
మంచిర్యాల: దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పాత మంచిర్యాలకు చెందిన లచ్చయ్య వేంపల్లి శివారులోని పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు స్తంభాలను మరోచోటికి మార్చాలని కోరారు.


