News January 30, 2025
వనపర్తి: భారీ కొండచిలువ పట్టివేత

వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలో ఎర్రగట్టు తండాకు కూతవేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంటపడింది. భయపడిన రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే స్నేక్స్ సొసైటీ టీంకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంటలకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసిన వలకు చిక్కిన సుమారు 18కిలోల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అడవిలో వదిలేశారు.
Similar News
News November 17, 2025
AP న్యూస్ రౌండప్

*నిధుల దుర్వినియోగం కేసులో IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ను మూడోసారి తిరస్కరించిన ACB కోర్టు
*నకిలీ మద్యం కేసులో చొక్కా సతీశ్ రిమాండ్ను NOV 25 వరకు పొడిగింపు
*మూడు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
*తన భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారంటూ MLA పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఏడుగురిని అరెస్టు చేసిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు
News November 17, 2025
జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్ వాయిదా

నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని 10 రోజుల కస్టడీకి కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వారు నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
News November 17, 2025
MBNR: ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.


