News January 30, 2025

వనపర్తి: భారీ కొండచిలువ పట్టివేత

image

వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలో ఎర్రగట్టు తండాకు కూతవేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంటపడింది. భయపడిన రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే స్నేక్స్ సొసైటీ టీంకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంటలకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసిన వలకు చిక్కిన సుమారు 18కిలోల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అడవిలో వదిలేశారు.

Similar News

News July 11, 2025

ములుగు జిల్లా జనసాంద్రత 71

image

ములుగు జిల్లా మొత్తం 3881 చ.కి.మి విస్తీర్ణం కలిగి ఉండగా 2,94,671 జనాభా ఉంది. వీరిలో పురుషులు 1,46,205, మహిళలు 1,48,466 ఉండగా జిల్లాలో జనసాంద్రత 71గా ఉంది. అయితే ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండొచ్చని పలువురు అంటున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా పేరెంట్స్ ప్రస్తుతం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.

News July 11, 2025

కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.

News July 11, 2025

రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు: ఎంపీ

image

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్‌ను తెరమీదకు తెస్తున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు మాత్రమే లాభం జరిగిందని, దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘కేటీఆర్‌కు నిజంగా దమ్ముంటే.. కేసీఆర్ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలి’ అంటూ సవాలు విసిరారు.