News January 31, 2025
వనపర్తి: మహాత్మా గాంధీని ఎల్లవేళలా స్మరించాలి: జిల్లా ఎస్పీ

నేటి మన స్వాతంత్రం,మన స్వేచ్ఛ మహాత్మా గాంధీ అసమాన త్యాగఫలం అని మనం ఎల్లవేళలా గాంధీని స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ సూచించారు. గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మరిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని సూచించారు.
Similar News
News November 13, 2025
WGL: అన్యాయం అంతరిస్తే ‘నా గొడవ’కు ముక్తి..!

‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పిన మానవీయ కవి, ప్రజా కవి కాళోజీ నారాయణరావు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, సంపదల్ని ఒకచోట గంపెడు బలగం ఒకచోట అంటూ, సమసమాజ నిర్మాణానికి తన కవితలతో కదం తొక్కిన ఉద్యమవీరుడు ఆయన. కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు.
#నేడు కాళోజీ వర్ధంతి.
News November 13, 2025
పాల్వంచ: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్

అత్తింటి వేధింపులు తాళలేక పురుగుమందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన సామర్ల యాదగిరి కుమార్తె దివ్య(21), రఘునాథపల్లి మండలం కుర్చపల్లికి చెందిన మంచాల రాజయ్య కొడుకు తిరుమల్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అత్తింటి నుంచి వరకట్న వేధింపులు తాళలేక దివ్య ఆత్మహత్యకు పాల్పడింది.
News November 13, 2025
కేసీఆర్పై జనవరి 19 వరకు చర్యలొద్దు: HC

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా KCRపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వచ్చే ఏడాది JAN 19 వరకు ఆయనతోపాటు హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సభర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను JAN 19కి వాయిదా వేసింది.


