News January 31, 2025
వనపర్తి: మహాత్మా గాంధీని ఎల్లవేళలా స్మరించాలి: జిల్లా ఎస్పీ

నేటి మన స్వాతంత్రం,మన స్వేచ్ఛ మహాత్మా గాంధీ అసమాన త్యాగఫలం అని మనం ఎల్లవేళలా గాంధీని స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ సూచించారు. గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మరిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని సూచించారు.
Similar News
News February 23, 2026
JGTL: దేవ్జీ.. రైతు బిడ్డ నుంచి “సుప్రీం కమాండర్” వరకు

జగిత్యాల(D) కోరుట్లకి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నిన్న లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన రైతు కుటుంబంలో పుట్టి, ఉద్యమ బాట పట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ సుప్రీం కమాండర్ స్థాయికి చేరుకున్నారు. మొదట రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరి, 1980వ దశకంలో జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో 1983లో పీపుల్స్వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. నంబాల కేశవరావు మృతి తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టారు.
News February 23, 2026
మృత్యుపాశాలుగా బ్రిడ్జిలు.. ముందే హెచ్చరించిన Way2News

ADB ఉట్నూర్(M)లోని <<19074105>>బ్రిడ్జిలు ఇరుకుగా ఉండి<<>> ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉట్నూర్ నుంచి ADB వెళ్లే దారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. షాంపూర్, పులిమడుగు వద్ద బ్రిడ్జిలకు సైడ్వాల్స్ లేకపోవడంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రమాదం అంచున ప్రయాణం అంటూ గతంలో Way2Newsలో కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే బస్సు ప్రమాదం జరిగేది కాదని విమర్శలు వస్తున్నాయి.
News February 23, 2026
తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్గా పాలమూరు బిడ్డ

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా పాలమూరు పరిధి గద్వాల్కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధారెడ్డి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. గుజరాత్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
#CONGRATULATIONS


