News February 16, 2025
వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.
Similar News
News March 20, 2025
సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
HYD: ఒక్కో IPL మ్యాచ్.. రూ.1.5 కోట్లు..!

ఉప్పల్ స్టేడియం వెన్యూను SRH వాళ్లు రెంట్కు తీసుకుంటారని ప్రతి IPL మ్యాచ్ కోసం రూ.1.5 కోట్లు తమకు చెల్లిస్తారని HCA ప్రెసిడెంట్ అన్నారు. IPL మ్యాచులలో HCA పాత్ర పరిమితంగా ఉంటుందని, మిగతా వాటిల్లో HYD ఉప్పల్ స్టేడియం మొత్తం HCA కంట్రోల్లో ఉంటుందని ప్రెసిడెంట్ జగన్ మోహన్రావు తెలిపారు. దీంతో హౌస్ కీపింగ్, క్లీనింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తామే తప్ప, టికెట్ల ధరలు తమ కంట్రోల్లో ఉండవన్నారు.
News March 20, 2025
తను నిజమైన వర్కింగ్ ఉమెన్: ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రాకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని ఇన్స్టాలో షేర్ చేశారు. తను వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై తనకెంతో ఇష్టమైన జామ పండ్లు కనిపించాయట వాటి ఖరీదు రూ.150 అయితే ప్రియాంక రూ.200 ఇచ్చి ఉంచుకోమని చెప్పిందట, అప్పుడు పండ్లు అమ్మె మహిళ మిగిలిన డబ్బులకు సరిపడేలా కొన్ని పండ్లు ఇచ్చి వెళ్లిందట. తను నిజమైన వర్కింగ్ ఉమెన్ అని నా మనసు గెలిచిందని ప్రియాంక ఇన్స్టాలో షేర్ చేశారు.