News February 16, 2025
వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.
Similar News
News March 7, 2026
ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
News March 7, 2026
MHBD: అక్రమ ఇసుక రవాణా సమన్వయంతో అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక రవాణాను అన్ని శాఖలు సమన్వయంతో అరికట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఇసుక అక్రమ రవాణా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక సరఫరా తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక సరఫరా చేయాలన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటమన్నారు.
News March 7, 2026
MHBD: సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర: అదనపు కలెక్టర్

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మహబూబాబాద్ TGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సమాజంలో ముందంజలో నిలుస్తున్నారని టీజీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ అన్నారు.


