News January 27, 2025
వనపర్తి: మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలోని 5 పురపాలికలకు ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 26తో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు,కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం నుంచి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. వనపర్తి మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
Similar News
News October 15, 2025
సత్తెనపల్లి: కీచక గురువుకు దేహశుద్ధి

మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. జెడ్పీ హైస్కూల్ టీచర్ జరార్డ్ బాబు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై చేయి వేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు గ్రామ పెద్దలతో కలిసి మంగళవారం స్కూల్కు వెళ్లి టీచర్ను నిలదీస్తూ దేహశుద్ధి చేశారు. డీవైఈవో ఏసుబాబు విచారణ జరిపి ఉపాధ్యాయుడితో రాతపూర్వక క్షమాపణ తీసుకున్నారు.
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.
News October 15, 2025
కర్నూలు జీఎస్టీ విజయోత్సవ సభకు జిల్లా నుంచి 400 మంది

కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 400 మంది ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్) హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ సభకు ట్రేడర్స్ను తరలించడానికి భీమవరం నుండి రెండు బస్సులు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.