News March 27, 2025

వనపర్తి: మృతిపై అనుమానం.. అంత్యక్రియలు నిలిపివేత..!

image

ఓ వ్యక్తి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం వాసి కృష్ణయ్య(42) మృతిచెందాడు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అతడి మోకాళ్ల వద్ద గాయాలు,శరీరం మొత్తం ఉబ్బి ఉండడం గమనించిన బంధువులు దహన సంస్కారాలను నిలిపివేశారు. ఈవిషయమై మృతుడి చిన్నాన్న వెంకన్న PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాడీని జిల్లా మార్చురీకి తరలించామని SIసురేశ్ తెలిపారు.

Similar News

News October 17, 2025

మామునూరు ఎయిర్‌పోర్టును నిధులు.. సీఎంను కలిసిన ఎంపీ

image

మమునూరు ఎయిర్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ కడియం కావ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులను కేటాయించారు. WGL ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభించబోతోందని ఎంపీ స్పష్టం చేశారు.

News October 17, 2025

‘ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధత కావాలి’

image

పార్వతీపురం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు.

News October 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 17, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.53 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.