News April 8, 2025
వనపర్తి: రేపటి నుంచే వార్షిక పరీక్షలు

వనపర్తి జిల్లా పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల: బడి చేరాలంటే వాగు దాటాల్సిందే..!

వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. SRCL(D) కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో చిన్నారులు నిత్యం వాగులో నుంచే పాఠశాలకు చేరుతున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
సిరిసిల్ల: CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందట..!

CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాలకవర్గంలో విభేదాలు రావడం, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలతో CESS కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఛైర్మన్ చిక్కాల రామారావు నివారణ మార్గాలు అన్వేషిస్తున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిని CESS కార్యాలయానికి ఆహ్వానించి వాస్తు దోషాలను చూడాలని కోరడం చర్చనీయాంశమైంది.


