News April 8, 2025
వనపర్తి: రేపటి నుంచే వార్షిక పరీక్షలు

వనపర్తి జిల్లా పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 17న పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.
Similar News
News October 14, 2025
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావుకు ఘన స్వాగతం

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు బయలుదేరారు. మార్గమధ్యంలో ఖాజీపేట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను రాంచందర్రావు పలకరించి, ముందుకు సాగారు.
News October 14, 2025
పాడేరు: హోమ్ స్టేల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి

హోమ్ స్టేల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక స్థలాలను గుర్తించి, హోమ్ స్టేలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్కు అందించాలన్నారు. వాష్ రూమ్స్, పార్కింగ్ స్థలాలు, ఫుడ్ కోర్టు, యాత్రికులు బస చేసేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.
News October 14, 2025
నేడే పైడిమాంబ తెప్పోత్సవం.. ఏర్పాట్లు పూర్తి..!

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం నేడు జరగనుంది. ఈ సందర్భంగా పెద్ద చెరువు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా వనం గుడి వద్ద వేద సభ ఉంటుందని, సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు.