News March 19, 2025

వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

image

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. 

Similar News

News November 24, 2025

GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

image

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.

News November 24, 2025

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

image

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

News November 24, 2025

ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్‌లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.