News March 19, 2025

వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

image

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. 

Similar News

News October 22, 2025

మరో సినిమాపై కాపీరైట్ కేసు వేసిన ఇళయరాజా

image

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘Dude’ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మేకర్స్, సంగీత దర్శకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీ, మంజుమ్మల్ బాయ్స్, మిసెస్ & మిస్టర్ సినిమాలపై కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే.

News October 22, 2025

ఉస్మానియా వర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టులు

image

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్లలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ, పీహెచ్‌డీ లేదా నెట్/సెట్/SLET అర్హతగలవారు ఈ నెల 28లోగా ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్& సోషల్ సైన్సెస్‌లో ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 22, 2025

కొయ్యలగూడెంలో అక్టోబర్ 24న జాబ్ మేళా

image

కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కాలేజీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహకారంతో అక్టోబర్ 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర బుధవారం తెలిపారు. 13 కంపెనీల హాజరవుతాయన్నారు. 985 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హత పొందిన 18-35 ఏళ్లు ఉన్నా వారు అర్హులన్నారు.