News March 19, 2025

వనపర్తి: రైతులకు ఏం చేశారో చెప్పండి: మాజీ మంత్రి

image

అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2050 నాటికి తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసోళ్లు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పదేళ్ల KCRపాలనలో తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. 

Similar News

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

News December 9, 2025

భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు.. ఇద్దరు సస్పెన్షన్

image

<<18509437>>భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు<<>> అని Way2Newsలో వచ్చిన కథనంపై ఈవో సునీత స్పందించారు.ఈ మేరకు ఆలయ బుకింగ్ కౌంటర్‌లో పని చేస్తున్న శరత్, నరేందర్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం అర్చకులు, సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు నచ్చితే తోచిన సంభావణ మాత్రమే ఇవ్వాలని, ఎవరైనా డిమాండ్ చేస్తే దేవస్థాన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.

News December 9, 2025

5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన: CM CBN

image

AP: గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘EX సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్యయోధులు, 1954కి ముందు అసైన్డ్ అయిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించాలి. అనుమతుల్లేని 430 రియల్ వెంచర్లలోని 15,570 ప్లాట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలి. 2.77 కోట్ల CAST సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానించాలి’ అని సూచించారు.