News September 23, 2024
వనపర్తి: రోడ్డు ప్రమాదంలో మృతులు వేరే

శ్రీరంగాపురం సమీపంలో ఇవాళ ఉదయం డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకూతురు మృతిచెందిన విషయం తెలిసింది. SI వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. నాగరాల గ్రామానికి చెందిన పురందేశ్వర్.. భార్య పిల్లలతో కలిసి బైక్పై శ్రీరంగాపురం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో పురందేశ్వర్ భార్య స్వాతి(26), కూతురు అశ్విత(3) అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 19, 2025
MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.


