News March 21, 2025
వనపర్తి: వరి పంటను కాపాడుకునే విధంగా చర్యలు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న వరి పంటను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సమస్య ఉంటే సమస్యను పరిష్కరించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేద్దామని సూచించారు.
Similar News
News December 17, 2025
బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.
News December 17, 2025
వరంగల్: పోలింగ్ ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 530 పంచాయతీలకు ఎన్నిక జరుగుతోంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా ఉదయం ఓటర్లు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు.
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


