News March 16, 2025

వనపర్తి: వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేర్ 41.3, కానాయిపల్లి 41.0, రేమోద్దుల 40.9, విలియంకొండ 40.9, పెద్దమందడి 40.5, గోపాల్ పేట 40.3, వనపర్తి 40.2, ఆత్మకూర్ 40.2, దగడ 40.1, రేవల్లి 40.0, జానంపేట 39.8, శ్రీరంగాపూర్ 39.7, ఘన్పూర్ 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 27, 2025

‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

image

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

News October 27, 2025

ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వండి: SP

image

ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలలో స్నానాలకు దిగవద్దని హెచ్చరించారు. ఇల్లు శిథిలావస్థలో ఉంటే బంధువుల ఇళ్లకు వెళ్లాలని సూచించారు.

News October 27, 2025

అవినీతి సంస్థ ఎదుగుదలను అడ్డుకుంటుంది: జీఎం రాజేశ్వర్ రెడ్డి

image

అవినీతి అనేది పని చేసే సంస్థ ఎదుగుదలను అడ్డుకుంటుందని, ప్రతి ఉద్యోగి నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025 కార్యక్రమాన్ని జీఎం ముఖ్య అతిథిగా, ప్రాజెక్ట్, ప్లానింగ్ జీఎం సాయిబాబు విశిష్ఠ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.