News March 16, 2025

వనపర్తి: వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా వెలుగొండలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేర్ 41.3, కానాయిపల్లి 41.0, రేమోద్దుల 40.9, విలియంకొండ 40.9, పెద్దమందడి 40.5, గోపాల్ పేట 40.3, వనపర్తి 40.2, ఆత్మకూర్ 40.2, దగడ 40.1, రేవల్లి 40.0, జానంపేట 39.8, శ్రీరంగాపూర్ 39.7, ఘన్పూర్ 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో పెరిగిన యాసంగి సాగు

image

జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలర పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు.

News March 1, 2026

శ్రీలంక కోచ్ పదవికి జయసూర్య రాజీనామా

image

తాను శ్రీలంక కోచ్ పదవి నుంచి దిగిపోతున్నట్లు సనత్ జయసూర్య ప్రకటించారు. T20 WCలో శ్రీలంక సూపర్-8లోనే ఇంటిదారి పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త కోచ్ అన్వేషణ మొదలుపెట్టింది. 2024లో జయసూర్య కోచ్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2026 వరకు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ మధ్యలోనే రాజీనామా చేశారు. ఇతడి హయాంలో శ్రీలంక 76 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడగా 36 మ్యాచుల్లో గెలిచింది.

News March 1, 2026

రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

image

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.