News March 26, 2025

వనపర్తి: సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వండి: డీఎంహెచ్వో

image

ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని లేదంటే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిజేరియన్‌లకు ప్రాధాన్యత ఇస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

image

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.

News November 15, 2025

రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

image

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.