News February 7, 2025

వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.

Similar News

News January 8, 2026

జిల్లా కేంద్రం మార్పుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే అంశంలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంది. గతంలో ఓ మండలం మార్పులో హైకోర్టు జోక్యం చేసుకోగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జిల్లా కేంద్రం మార్పును సవాల్ చేస్తూ ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.

News January 8, 2026

శీతాకాలంలో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

image

చలికాలంలో దాహం వేయట్లేదని నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల ఉమ్మనీరు తగ్గడంతో పాటు డెలివరీ తర్వాత పాలు కూడా తక్కువగా వస్తాయి. అలాగే గర్భిణులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలు, ఇతర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బచ్చలికూర, మెంతి ఆకు, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

వేద పారాయణారుల మార్కుల పరిశీలన పూర్తి

image

టీటీడీ 700 మంది వేద పారాయణదారుల నియామకం కోసం గతనెల ఇంటర్వూలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వివిధ వేదాలు వేద పండితులు మార్కులను టీటీడీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.