News February 7, 2025

వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.

Similar News

News February 12, 2026

నిర్మల్: బల్దియా పీఠం ఎవరికి ?

image

నిర్మల్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఛైర్‌పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఆసక్తి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పీఠం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఎవరికి వారు తమ పార్టీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మల్ బల్దియాపై ఏ పార్టీ ఆధిపత్యం చాటుతుందో వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News February 12, 2026

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలి: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్‌తో కలిసి ఆర్జాలబావిలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.

News February 12, 2026

MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

image

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.