News February 7, 2025

వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.

Similar News

News February 7, 2025

ఆసిఫాబాద్: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్  

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు.

News February 7, 2025

చేతిరాత మార్చుకోలేకపోయా: మోదీ

image

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

News February 7, 2025

కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు: JC

image

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జేసీ నిషాంతి తెలిపారు. శుక్రవారం కళ్యాణ వేదిక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు, మినీ కంట్రోల్ రూమ్, బీచ్ పాయింట్, స్నాన ఘట్టాలు ఆమె పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 12.55 గంటలకు కళ్యాణం జరుగుతుందన్నారు. నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని చెప్పారు.

error: Content is protected !!