News January 28, 2025
వనపర్తి: CPM చరిత్రలో తొలిసారి దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి..!

ఎర్రజెండా చరిత్రలో మొదటిసారిగా దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కిందని సీపీఎం అమరచింత మండల కార్యదర్శి జీఎస్ గోపి అన్నారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ ఎంపిక చరిత్రలోనే మొదటిసారిగా ఓ దళితునికి రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి కట్టబెట్టడం ఆ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా అత్యున్నత పదవి దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా జాన్ వెస్లీ చరిత్ర సృష్టించాలని గోపి అన్నారు.
Similar News
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
News December 3, 2025
సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.
News December 3, 2025
కోనసీమ జిల్లా వాసులకు GOOD NEWS

అమలాపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతి లక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని ఆమె సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


