News March 21, 2025

వనపర్తి: GREAT.. హిందూ ఇంట్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు

image

వనపర్తి జిల్లా ఆత్మకూరులో గురువారం రాత్రి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు స్థానిక కొండాపురం కురుమూర్తి ఆయన స్వగృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీంతో ముస్లిం సోదరులకు.. హిందూ సోదరుడు ఇఫ్తార్ విందు ఇవ్వడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. సోదర భావాన్ని చాటుకున్న కురుమూర్తికి, ముస్లిం సోదరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షఫీ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం: CM

image

CII సమ్మిట్‌లో సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు CM చంద్రబాబు సమక్షంలో AP ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం MOU కుదుర్చుకుంది. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని APలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM పేర్కొన్నారు. AI లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలని ఆయన సూచించారు. నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందన్నారు.

News November 15, 2025

తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

image

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకొని హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా తండ్రితో కలిసి చేసిన మూవీలో ఓ స్టిల్‌ను షేర్ చేసుకున్నారు. ‘ఇవాళ మిమ్మల్ని కాస్త ఎక్కువగానే మిస్ అవుతున్నాను. నాన్నా మీరు ఉండి ఉంటే గర్వపడేవారు’ అని ట్వీట్ చేశారు. ఇది చూసి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ‘ఆయన్ను మీరు ఎప్పుడో గర్వపడేలా చేశారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

News November 15, 2025

రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల కోట్ల చేప పిల్లల పంపిణీ: వాకిటి

image

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 88 వేల కోట్ల చేప పిల్లలు, 300 చెరువుల్లో 28 కోట్ల రొయ్యలు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. చేపల పంపిణీ పారదర్శకంగా ఉండేలా చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య సంపదతో ఆర్థిక అభివృద్ధి సాధించేలా చర్యలు చేపడతామన్నారు.