News March 26, 2025
వనపర్తి POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా వనపర్తి డీసీసీ చీఫ్గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం చీర్ల చందర్, సాయిచరణ్ రెడ్డి, L.సతీశ్ ఆశావహులుగా ఉన్నారు.
Similar News
News December 8, 2025
నిర్మల్: వాతావరణ శాఖ హెచ్చరిక

జిల్లాలో రాబోయే రోజుల్లో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల మధ్య ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు. జిల్లా వాసులు సాయంత్రం తర్వాత తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
News December 8, 2025
గద్వాల: వలస ఓటర్లపై అభ్యర్థుల దృష్టి

గద్వాల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో అభ్యర్థులు దృష్టి వలస ఓటర్లపై పడింది గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోసం.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి నగరాలకు వలస వెళ్లారు. అయినప్పటికీ వారి ఓటు మాత్రం గ్రామాల్లోనే ఉంది. వారికి ఫోన్ చేసి గ్రామాలకు రప్పించేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 8, 2025
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


