News July 31, 2024
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డీఆర్వో

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం డిఆర్ఓ కెవి ప్రసాద్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచనలతో సీతారామపురం మండలం చింతోడు, బోడసిద్ధాయపల్లి, గుండుపల్లి గ్రామాల ప్రజలకు అటవీ చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.
Similar News
News November 29, 2025
డిసెంబర్ 6 వరకు ఓపెన్ టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం.!

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే వారు డిసెంబర్ ఆరో తేదీలోగా ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. అభ్యాసకులు నేరుగా https://bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 7 వరకు, రూ.200 అపరాధ రుసుముతో 10 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 13 వరకు అవకాశం ఉందన్నారు.
News November 29, 2025
నెల్లూరు: డ్రైవింగ్ లైసెన్స్.. ఇక ఈజీ కాదండోయ్!

నెల్లూరు వాసులకు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. ఇకనుంచి అంత ఈజీ కాదు. పక్కాగా డ్రైవింగ్ నేర్చుకుంటేనే లైసెన్స్ వస్తుంది. ఇప్పటిలాగా డ్రైవింగ్ టెస్ట్లో ఆషామాషీగా డ్రైవింగ్ చేస్తే అన్ ఫిట్ అవుతారు. కారణం ఏమంటారా.. DTCఆఫీస్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటైంది. 13 సెన్సార్లు, 14 వీడియో కెమెరాలు, 8 VMSబోర్డులు, సెన్సార్ బుల్లెట్ల మధ్య పక్కాగా డ్రైవింగ్ చేస్తేనే లైసెన్స్ వస్తుంది.
News November 29, 2025
జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు: కలెక్టర్

జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు నవంబర్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జనవరి 31, 2026 వరకు ఈ పొడిగింపు ఉంటుందన్నారు. జిల్లాలోని విలేకరులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


