News July 31, 2024

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డీఆర్వో

image

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం డిఆర్ఓ కెవి ప్రసాద్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచనలతో సీతారామపురం మండలం చింతోడు, బోడసిద్ధాయపల్లి, గుండుపల్లి గ్రామాల ప్రజలకు అటవీ చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.

Similar News

News November 16, 2025

మర్రిపాడు: హైవేపై ఘోర ప్రమాదం.. 10మందికి గాయాలు

image

మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

image

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

News November 15, 2025

సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల

image

పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు. చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.