News July 31, 2024

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు : డీఆర్వో

image

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం డిఆర్ఓ కెవి ప్రసాద్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉదయగిరి రేంజర్ ఉమామహేశ్వర్ రెడ్డి సూచనలతో సీతారామపురం మండలం చింతోడు, బోడసిద్ధాయపల్లి, గుండుపల్లి గ్రామాల ప్రజలకు అటవీ చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.

Similar News

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

image

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 20, 2025

మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

image

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.