News December 11, 2024
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం రాష్ర్టంలో ఏమైంది: ఎంపీ
ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డులు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Similar News
News January 18, 2025
నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News January 18, 2025
నెల్లూరు: వైభవంగా రాపత్తు ఉత్సవాలు
నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News January 17, 2025
‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.