News February 8, 2025

వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఆర్‌వో గణేశ్

image

వయో వృద్ధులకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి విగణేశ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

Similar News

News February 9, 2025

ఆదిలాబాద్: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

image

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

News February 9, 2025

ఆదిలాబాద్: మహిళలకు GOOD NEWS.. 11న జాబ్ మేళా

image

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 TASK ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన GLITZ CORP ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం పేర్కొన్నారు. 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, భోజనం, రవాణా సౌకర్యం, వసతి నెలకు అలవెన్స్ ఉంటుందన్నారు.

News February 9, 2025

కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!