News February 8, 2025
వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఆర్వో గణేశ్

వయో వృద్ధులకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి విగణేశ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News March 23, 2025
స్టార్ హీరో ఆత్మహత్య కేసు.. ట్రెండింగ్లో నటి

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును CBI <<15854658>>క్లోజ్<<>> చేయడం సంచలనంగా మారింది. అతడి మృతికి ప్రేయసి రియా చక్రబర్తే కారణమంటూ మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. కానీ ఆమెకు క్లీన్చిట్ వచ్చింది. దీంతో సుశాంత్కు న్యాయం జరగలేదంటూ అతడి అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ కేసుతో నాలుగేళ్లు నరకం అనుభవించిన రియాకు న్యాయం జరిగిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె పేరు SMలో ట్రెండ్ అవుతోంది.
News March 23, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. వాతావరణ ప్రభావంతో కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 37.5℃ నమోదు కాగా రామగిరి 37.4, ముత్తారం 37.8, పాలకుర్తి 36.8, కమాన్పూర్ 36.7, ఓదెల 36.6, సుల్తానాబాద్ 36.2, కాల్వ శ్రీరాంపూర్ 36.1, రామగుండం 35.8, అంతర్గం 35.6, పెద్దపల్లి 34.8, ధర్మారం 34.6, ఎలిగేడు 34.4, జూలపల్లి 33.2℃ గా నమోదయ్యాయి.
News March 23, 2025
గజ్వేల్: అహ్మదీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొగుట వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న లారీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.