News March 1, 2025
వరంగల్కు ఎయిర్పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
Similar News
News November 26, 2025
నిరూపించండి.. రాజీనామా చేస్తా: MLC భూమిరెడ్డి

మాజీ సీఎం వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాయలసీమకు అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇచ్చారా?, అరటి పంటకు బీమా ఎక్కడ చెల్లించాలో చెప్పాలని ప్రశ్నించారు. బీమా చెల్లించినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జగన్కు ఆయన సవాల్ విసిరారు. జగన్ వల్లే పులివెందులలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదన్నారు.
News November 26, 2025
నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సాధారణ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, గడువు తర్వాత నామినేషన్లు స్వీకరించరాదని సూచించారు.
News November 26, 2025
ASF: నామినేషన్ల స్వీకరణ సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణలతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా మొదటి విడత 5 మండలాల రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


