News March 1, 2025
వరంగల్కు ఎయిర్పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
Similar News
News October 30, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు ఫొటోగ్రఫీ & వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సంవత్సరాలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు నవంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9502593347 నంబర్ను సంప్రదించవచ్చు.
News October 30, 2025
కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్ణయించామన్నారు. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని తెలిపారు.
News October 30, 2025
ASF: వైద్య కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

ఆసిఫాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గల ఖాళీల కోసం ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పత్రిక తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను DMLT-30 & DECG – 30 సీట్లు ఉన్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 28 నుంచి నవంబర్ 27 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.


