News February 19, 2025
వరంగల్కు నూతన మూల్యాంకన క్యాంపు

వరంగల్ జిల్లా కేంద్రంగా ఇంటర్ నూతన మూల్యాంకన క్యాంపు మంజూరు చేసినట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. గతంలో హన్మకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల ఇంటర్ సిబ్బంది మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో తరగతి గదులు, కార్యాలయం, సౌకర్యాలను పరిశీలించిన పిమ్మట నూతన క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Similar News
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.


