News April 4, 2025

వరంగల్‌కు పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

image

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Similar News

News November 2, 2025

HYD: అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్య ప్రవర్తన

image

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన HYDబంజారాహిల్స్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..ఇందిరానగర్‌లో నివసించే ఇద్దరు అమ్మాయిలు బర్త్ డే వేడుకల అనంతరం తమ సోదరుడిని ఇంటికి పంపించి వస్తున్నారు. అదే వీధిలో ఉండే బాలు,నవీన్ వారిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించగా బాలికలు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News November 2, 2025

HYD: అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్య ప్రవర్తన

image

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన HYDబంజారాహిల్స్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..ఇందిరానగర్‌లో నివసించే ఇద్దరు అమ్మాయిలు బర్త్ డే వేడుకల అనంతరం తమ సోదరుడిని ఇంటికి పంపించి వస్తున్నారు. అదే వీధిలో ఉండే బాలు,నవీన్ వారిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించగా బాలికలు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News November 2, 2025

బద్ది పోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.