News March 26, 2025
వరంగల్:రీవాల్యుయేషన్కు 21,920 దరఖాస్తులు!

ఇటీవల కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1st సెమిస్టర్లో 21.9%, 3rd సెమిస్టర్లో 28.9%, 5th సెమిస్టర్లో 40.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. ఆయా సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్లో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 21,920 దరఖాస్తులు వచ్చాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Similar News
News July 8, 2025
ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
News July 8, 2025
ఉమ్మడి NZB జిల్లా ఇన్ఛార్జ్గా అజ్మత్ హుస్సేన్

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉండగా అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను సోమవారం నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ సీనియర్ నేత అజ్మత్ ఉల్లా హుస్సేన్ను నియమించింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్గా ఉన్నారు.
News July 8, 2025
JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.