News April 9, 2025

వరంగల్‌లో CONGRESS VS BRS

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News December 3, 2025

తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

image

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఈనెల 17న తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి.పద్మావతి తెలిపారు. ఈ బస్సు శ్రీశైలం, మహానంది, అహోబిలం, పళని, గురువాయూర్, అయ్యప్ప సన్నిధానం, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుందని బుధవారం ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

News December 3, 2025

దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

image

దేవరకొండ, గాంధీనగర్‌లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.

News December 3, 2025

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పూర్తి చేయాలి.!

image

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పనులను త్వరగా చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌కు సంబంధించి వివరాలు తెలిపారు. పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఒక లేఖను కేంద్ర మంత్రికి అందించారు.