News April 9, 2025
వరంగల్లో CONGRESS VS BRS

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News November 1, 2025
GWL: ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. చెన్నిపాడులోని దారిలో ఉన్న అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వారు. విషయం తెలుసుకున్న VHP జిల్లా నాయకుడు మానవపాడు రఘు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాలను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 1, 2025
పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.
News November 1, 2025
ఖమ్మం: కలకలం రేపుతున్న సీపీఎం నేతల హత్యలు!

జిల్లాలో సీపీఎం నేతలు హత్యలకు గురికావడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. 2022లో దుండగుల చేతిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం చింతకాని(M) పాతర్లపాడులో రామారావు అదే రీతిలో దుండగుల చేతిలో హతమయ్యాడు. వీరిద్దరూ స్థానికంగా బలమైన, పార్టీలో కీలక నేతలు కావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే.. అది కూడా CPM నేతలే హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.


