News April 9, 2025

వరంగల్‌లో CONGRESS VS BRS

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News November 26, 2025

0-5 ఏళ్ల చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

image

జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఐడీఓసీలో ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులకు ఆయన ఈ విషయాన్ని సూచించారు.

News November 26, 2025

NRPT: ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: ఈసీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.

News November 26, 2025

MDK: పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

image

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్ధబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు వున్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. MDKలో 492, SRDలో 613, SDPTలో 508 జీపీలు ఉన్నాయి.