News March 8, 2025
వరంగల్లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్ను పరిశీలించారు.
Similar News
News January 19, 2026
మహిళల స్వావలంబనకే ప్రభుత్వ ప్రాధాన్యం: అడ్లూరి

మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News January 19, 2026
మేడారంలో అద్భుతం.. ఎరుపు రంగులో జంపన్నవాగు.!

మేడారంలోని జంపన్నవాగు సూర్యాస్తమయ వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సూర్యకిరణాలు వాగుపై పడటంతో నీరంతా ఎరుపు రంగుగా మారింది. చారిత్రక ప్రకారం సమ్మక్క కుమారుడు జంపన్న వీరమరణం పొందిన సమయంలో వాగు ఎర్రబడినట్లు చెబుతుంటారు. ఇప్పుడు వాగు ఎర్రగా కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోతున్నారు. నిండుకుండలా ఉన్న వాగు ఎరుపురంగులో వెలిగిపోతున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
News January 19, 2026
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు దావోస్ పర్యటన కీలకం: ఎంపీ సానా

CM చంద్రబాబు దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని MP సానా సతీష్ బాబు అన్నారు. సోమవారం ఢిల్లీలో CMని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాత్రింబగళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు కృషిని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటన విజయవంతమై రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ పర్యటన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


