News March 8, 2025
వరంగల్లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్ను పరిశీలించారు.
Similar News
News March 5, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News March 5, 2026
పెద్దపల్లి: స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్ ఇలా…

జిల్లా PHC/UHCలలో స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్: మార్చి 6- PHC రాఘవపూర్, 7- PHC ఓదెల, UHC అడ్డగుంటపల్లి, 9- UHC అల్లూరు, PHC పుట్నూరు, 10- UHC జనగాం, 5 ఇంక్లైన్, 11- PHC రాగినేడు, లక్ష్మీపూర్, 12- UHC పెద్దపల్లి, PHC రామగుండం, 14- అంతర్గాం, 16- బసంత్ నగర్, 17- బేగంపేట, 18- ఎలిగేడు, 20- గద్దలపల్లి, 23 -గర్రెపల్లి, 24 -జూలపల్లి, 25 -కమాన్పూర్, 26- కొలనూరు, 28 కునారం, 30 -మేడారం, 31 -ముత్తారం.
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.


