News February 19, 2025

వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 29, 2025

WGL: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

image

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవల వారు పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా, ఎటువంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.

News October 29, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>)లో 110 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులు అనర్హులు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News October 29, 2025

జూబ్లీహిల్స్ ప్రచారంపై.. మొంథా ఎఫెక్ట్

image

HYDలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJPలు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వర్షానికి ప్రభావితమైంది. దీనికారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని త్వరగా ముగించారు. వర్షాల నుంచి ఉపశమనం కోసం అఖిలపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.