News February 26, 2025
వరంగల్: ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నగరంలోని ములుగురోడ్డు సమీపంలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ విద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత(20) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేశ్వర్

తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్(టీఏసీసీయూ) రాష్ట్ర కార్యదర్శిగా మెదక్కు చెందిన కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రామణా రెడ్డి ఎన్నికయ్యారు.
News November 23, 2025
భారీ జీతంతో 115 ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్సైట్: https://bankofindia.bank.in/
News November 23, 2025
MHBD జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

MHBD, తొర్రూర్ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫేస్-1 ఎన్నికల్లో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు, 2వ విడతలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, థర్ద్ ఫేస్లో డోర్నకల్, గంగారాం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.


