News June 1, 2024

వరంగల్: ఒక్క రూపాయి గొడవ.. ఒకరి మృతి

image

వరంగల్ గాంధీ నగర్‌లో బిర్యానీ సెంటర్లో ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఒకరు మృతి చెందారు. ఒక బిర్యానీ సెంటర్లో రూ.59 రూపాయల బిర్యానీకి అరవింద్ అనే యువకుడు రూ.60లు ఫోన్ పే చేశాడు. ఒక్క రూపాయి విషయంలో అరవింద్‌కు, ప్రేమ్ సాగర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో కిందపడ్డ ప్రేమ్ సాగర్ చిన్న మెదడు చిట్లి మృతి చెందాడు. మిల్స్ కాలనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 4, 2024

వరంగల్: తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.

News October 4, 2024

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 4, 2024

మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.