News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేశారు.
Similar News
News January 3, 2026
పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!

చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News January 3, 2026
సంగారెడ్డి: ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. 2025-26 సంవత్సరానికి 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించుకోగా, 1,225 ఎకరాలు పూర్తయిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
News January 3, 2026
సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారు: అక్బరుద్దీన్

TG: సభకు రాని వ్యక్తి సభ అజెండా డిసైడ్ చేస్తున్నారంటూ KCRను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో MIM MLA అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆయన ఇరిగేషన్పై చర్చిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు BRS ఎమ్మెల్యేలెవరూ సభలో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇక 2,3 రోజుల నుంచి అసెంబ్లీలో కృష్ణా, గోదావరి తప్ప వేరే అంశాలపై చర్చించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇతర సమస్యలపైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


