News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేశారు.
Similar News
News December 23, 2025
VJA: రైల్వే మ్యాప్లో రాయనపాడు సరికొత్త ముద్ర

రాయనపాడు రైల్వేస్టేషన్ సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా, HYDలోని చర్లపల్లి స్టేషన్ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 80% పునర్నిర్మాణ పనులు పూర్తికాగా, అత్యాధునిక వసతులతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. వచ్చే ఏడాదికి ఈ స్టేషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో, విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి.
News December 23, 2025
శ్రీకాకుళం: ‘రూ.80 వేలు కడతావా.. అరెస్ట్ అవుతావా’

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు.
News December 23, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రానున్న భారీ పరిశ్రమ

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలో 1,591.17 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


