News January 24, 2025
వరంగల్: క్రమంగా తగ్గుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం రూ.7,220 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,200, బుధవారం రూ.7,210 అయింది. నిన్న భారీగా తగ్గి రూ.7,135కి చేరిన పత్తి ధర నేడు రూ.7120కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ధరలు మళ్లీ తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 20, 2025
పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.
News February 20, 2025
జెలెన్స్కీ ఓ నియంత: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
News February 20, 2025
ఇసుక సరఫరాపై నిఘా పెంచాలి: ఇలా త్రిపాఠి

వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.