News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News December 7, 2025

ఏలూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ.200 నుంచి 280, చేపలు కిలో రూ.150 నుంచి రూ.300, రొయ్యలు కిలో రూ.300 నుంచి 500, మటన్ కిలో రూ.800 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో చికెన్ రూ.220 రూపాయల నుంచి రూ.300, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 300 రూపాయలు, మటన్ కిలో రూ.900 రూపాయలుగా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు

image

AP: రేషన్‌లో బియ్యం, చక్కెరతోపాటు రాగులు, జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ నుంచే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది. పలు జిల్లాల్లో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తోంది. 20 KGs రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్ఠంగా 3KGs వరకు రాగులు, జొన్నలు, 17 KGs బియ్యం ఇస్తోంది. కాగా TDP ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగిపిండిని పంపిణీ చేసింది.

News December 7, 2025

శని దోష నివారణకు పాటించాల్సిన పరిహారాలు

image

శని దోషం ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే కొన్ని పరిహారాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తారు. ‘ప్రతి శనివారం నువ్వుల నూనెతో శని దేవుడికి దీపం పెట్టాలి. పక్షులకు ఆహారం, నల్ల చీమలకు చక్కెర పెట్టాలి. పెరుగన్నం దానం చేయాలి. సోమవారం శివాలయాలను దర్శించాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠిస్తే ఫలితాలుంటాయి. దశరథ శని స్తోత్రంతో శని దోషం సన్నగిల్లుతుంది’ అంటున్నారు.