News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News March 15, 2026

కామారెడ్డి: 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు

image

రామారెడ్డి మండలం అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DLPO శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో సన్మానాలు నిర్వహించామన్నారు.

News March 15, 2026

నిజామాబాద్: బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు వారికి దిశా నిర్దేశం చేశారు.

News March 15, 2026

రేపు నెల్లూరు జైలు వద్దకు వెళ్లనున్న MP మిథున్ రెడ్డి

image

నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వెళ్లనున్నారు. జైల్లో ఉన్న మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో వారు మూలాఖత్ కానున్నారు. వీరితో పాటు స్థానిక వైసీపీ నేతలు జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.