News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News December 7, 2025

రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

image

AP: బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. రైతుబజార్లను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లను <>digirythubazaarap.com<<>> సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది.

News December 7, 2025

శని దోషాలు ఎన్ని రకాలు?

image

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.

News December 7, 2025

21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్

image

AP: రాష్ట్రంలో 21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు CS విజయానంద్ తెలిపారు. ‘7.48 లక్షల SC, ST వినియోగదారుల ఇళ్లపైనా 2 కిలోవాట్ల చొప్పున 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సెట్లను అమర్చాలి. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ సిస్టమ్స్, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చిలోగా ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు సూచించారు.