News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News February 8, 2026
రేపు జానకీ జయంతి.. ఇలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం

శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జయంతి రేపు. దీనినే జానకీ జయంతి/సీతా అష్టమి అంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి సీతారాముల ఫొటో పెట్టి పూలతో అలంకరించాలి. ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి పూజించాలి. సీతారాముల అష్టోత్తరం చదవాలి. 5/9 మంది సుమంగళులకు పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇచ్చి భోజనం పెట్టాలని పండితులు చెబుతున్నారు.
News February 8, 2026
NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News February 8, 2026
‘ముస్తాబు’తో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమూల మార్పులతోనే ‘స్కూల్ ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. బెలగాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని, గేటు నుంచి తరగతి గదుల వరకు మార్గాన్ని అందమైన పూలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.


