News October 24, 2024

వరంగల్: క్వింటా మొక్కజొన్న ధర రూ. 2,555

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలకగా.. మంగళవారం రూ.2,535కి చేరింది. నిన్న (బుధవారం) రూ.2,565 వచ్చిన మక్కలు ధర నేడు రూ. 2,555కి తగ్గింది. రెండు నెలల క్రితం వరకు రూ.3,000కు పైగా పలికిన మొక్కజొన్న ధర పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 17, 2025

వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

image

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.

News November 17, 2025

వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

image

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.

News November 17, 2025

వరంగల్: ప్రజావాణిలో 124 వినతుల స్వీకరణ

image

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి హాజరై ప్రజలు ఇచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 124 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో అధిక శాతం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ సమస్యలకు సంబంధించినవని అధికారులు పేర్కొన్నారు.