News March 22, 2025
వరంగల్: గిరిజన యువకులకు మెగా జాబ్ మేళా

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం (ఉమ్మడి వరంగల్) పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10 గంటల నుంచి హనుమకొండ గిరిజన భవన్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సుచిత్ర మిశ్రా తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరని తెలిపారు.
Similar News
News October 16, 2025
నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రావద్దు: మంత్రి వాకిటి

ఇంటిలో నిర్మాణాలలో లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు పట్టణంలో ఆయన కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర ఛైర్మన్ కేశం నాగరాజు గౌడ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇల్ల నిర్మాణంలో వేగవంతం చేయాలని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తహశీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.
News October 16, 2025
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.