News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

Similar News

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News November 15, 2025

ఏలూరు యువతకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

image

ఏలూరు జిల్లా యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు శుక్రవారం తెలిపారు. రెండేళ్ల కాంట్రాక్టుతో ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. డిప్లొమా పూర్తి చేసి, వెల్డింగ్‌లో పదేళ్ల అనుభవం ఉన్న 45 ఏళ్లలోపు వారు అర్హులు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

News November 15, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.