News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

Similar News

News October 29, 2025

ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లకు తుమ్మల ఫోన్

image

మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని, కీలక ఆదేశాలు జారీ చేశారు.

News October 29, 2025

శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

image

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్‌ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్‌ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.

News October 29, 2025

GNT: 39 మంది గర్భిణులను జీజీహెచ్‌కు తరలింపు

image

‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సోమవారం, మంగళవారం రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 39 మంది గర్భిణులను సురక్షితంగా GNT GGHకు తరలించారు. తరలించిన గర్భిణులలో అచ్చంపేట, కారంపూడి, పెదకూరపాడు, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన మహిళలు ఉన్నారు. 24 గంటల విద్యుత్‌కు అంతరాయం కలగకుండా, 8 జనరేటర్లకు సరిపడా ఇంధనాన్ని సిద్ధం చేశారు.