News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News November 27, 2025
నస్పూర్: కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
News November 27, 2025
ఇక పీరియడ్ బ్లడ్తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
News November 27, 2025
NGKL: మొదటి రోజు నామినేషన్లు మండలాల వారీగా ఇలా..!

నాగర్కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 121 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వంగూరు: 24
తెలకపల్లి: 25
తాడూరు: 23
కల్వకుర్తి: 19
వెల్దండ: 19
ఊర్కొండ: 11
అలాగే, వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు.


